డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం జనాలపై ఏ రేంజ్ ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి, చెడులు క్షణాలలో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక సెలబ్రిటీల విషయం గురైతే అసలే చెప్పనక్కర్లేదు. జరగనివి జరిగినట్టు, జరిగినవి జరగనట్టు ప్రచారం చేస్తూ అభిమానులని భయాందోళనలకి గురి చేస్తున్నారు. గత కొంత కాలంగా సెలబ్రెటీల గురించి చనిపోయినట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనలు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
తాజాగా సినీ నటి రాధిక కొన్ని రోజులుగా బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, అందుకే బయట కనిపించడం లేదని వార్తలు బయల్దేరాయి. ఈ వార్త తమిళనాడు అంతటా వ్యాపించింది. దీంతో ఓ అభిమాని ట్విటర్ ద్వారా నేరుగా రాధికనే కేన్సర్ గురించి ప్రశ్నించాడు.
దాంతో ఒక్కసారే షాక్ తిన్న నటి రాధిక మరీ ఇంతఘోరమైన పుకార్లు కూడా పుట్టిస్తారా..తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని..సినిమాల్లో కూడా నటిస్తున్నానని..ఇలాంటి పిచ్చి పుకార్లు నమ్మోదని అన్నారు. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టి పారేసింది. ఆ మద్య రవితేజ నటించిన ‘రాజాది గ్రేట్’ సినిమాలో రవితేజ తల్లిగా నటించారు రాధిక.
Not true, some imagination. https://t.co/DN1n3cCvaB— Radikaa Sarathkumar (@realradikaa) May 21, 2018