అనంత్ అంబానీ పెళ్లి.. మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. ఆ ఇద్దరికే రూ. 141 కోట్లు ఇచ్చారట?

praveen
ఇప్పుడు దేశం లో ఎక్కడ చూసిన కూడా ఒకే విషయం గురించి అందరూ మాట్లాడు కుంటున్నారు. అదే ఇండియాలో అపర కుబేరుడిగా పేరు సంపాదించుకున్న ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక గురించి. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా కూడా వీరి పెళ్లి వేడుక గురించి చర్చ జరుగుతుంది.

 ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి వేడుకలో ప్రదర్శనలు ఇచ్చేందుకు ఇండియాకు తరలి వచ్చారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వారికి కోట్ల రూపాయల పారితోషకం కూడా ఇస్తున్నారు అంటూ ఎన్నో వార్తలు వైరల్ గా మారిపోతున్నాయి. అయితే ఎవరికి ఎంత పారితోషకం ఇచ్చారు. ఇక ఇలా పెళ్లి వేడుక కోసం ఎన్ని వందల కోట్ల రూపాయలను ముఖేష్ అంబానీ ఖర్చు పెట్టారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా వేదికగా తెగ వెతికేస్తూ ఉన్నారు ఎంతో మంది ఇంటర్నెట్ జనాలు.

 అయితే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి వేడుకకు బాలీవుడ్ హాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సింగర్ లందరినీ కూడా పిలిపించారు. అయితే ఆ సింగర్లకు భారీ మొత్తంలోనే పారితోషకాలు ముట్ట  చెప్పారట. కేవలం సింగర్లకు 141 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడట రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన పాప్ సింగర్ జస్టిన్ బీర్ వరకు 83 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఎంగేజ్మెంట్ వేడుకలో పాట పాడిన రిహాన్నకు 58 కోట్లు పారితోషికం ఇచ్చారట. ఇలా కేవలం ఇద్దరు సింగర్లకు 141 కోట్లు చెల్లించాడట ముఖేష్ అంబానీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: