మనీ: ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్.. వేతనం పెంపు..!!
అత్యధికంగా హర్యానాలో రోజుకి రూ.374 రూపాయలు చొప్పున వేతనం ఇస్తున్నారు.. ఇక నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలలో రోజుకి రూ.234 రూపాయలు అందిస్తున్నారు. అలాగే సిక్కిం లోని మూడు పంచాయితీలలో రూ.374 రూపాయలు చొప్పున అందిస్తున్నారట. ఇక తెలుగు రాష్ట్రాలలో విషయానికి వస్తే తెలంగాణలో రోజు వారి కూలి 300 రూపాయలు ఉన్నది..2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 272 గా ఉన్నది.. అయితే ఈ పెంచిన మొత్తం ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రాబోతోందట.
గోవాలో వేతన పెంపు రేటు అత్యధికంగా 34 రూపాయలను పెంచారట.. ప్రస్తుతం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు రోజువారి వేతనం కేంద్ర ప్రభుత్వం రూ.272 రూపాయలు అమలు చేయగా ఇప్పుడు అదనంగా మరొక 28 రూపాయలు జోడించి మొత్తం 300 రూపాయలను ఇవ్వబోతున్నారు. తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాలలో కూడా 300 రూపాయలు కాబోతున్నట్లు తెలుస్తోంది. కేరళలో 346 రూపాయలు.. కర్ణాటకలో 349.. తమిళనాడులో 319 రూపాయలు.. గోవాలో 356.. పంజాబ్ లో 322 రూపాయలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఉపాధి కూలీలు సైతం కాస్త ఆనందాన్ని తెలుపుతున్నారు.