మనీ: తక్కువ టైంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే పథకం..!!
టైం డిపాజిట్ అనే పథకం ద్వారా మనం పెట్టుబడి పెడితే..1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని సైతం పొందవచ్చు ఇందులో మనం కనీసం రూ .1000 తో పెట్టుబడి ప్రారంభిస్తే పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్లను ఒక ఏడాది నుంచి ఐదేళ్ల వరకు పెట్టుబడి ఉంచితే.. ఇది వేరువేరు సంవత్సరాలకు వేరువేరు రాబడిన సైతం అందిస్తుంది.. మనం ఒక సంవత్సరం పాటు ఇందులో పెట్టుబడి పెడితే..6.8% రాబడి లభిస్తుంది. అదే రెండేళ్లు అయితే..6.9% లభిస్తుంది ఐదేళ్లు అయితే 7.5% వరకు రాబడి లభిస్తుంది.
ఈ ప్లాన్ లో ప్రతి నెల కూడా వడ్డీని లెక్కించబడుతుంది దీన్ని మనం ఏటా పొందవచ్చు.. ఐదేళ్లలో టర్మ్ డిపాజిట్ లలో ఐదు లక్షలు పెట్టుబడి పెడితే మనకు..7.5% వడ్డీ లభిస్తుంది. రూ.7,24,149 రూపాయలను పొందవచ్చు. ఇందులో ఐదు లక్షలు పెట్టుబడి ఇంకా మిగిలి ఉన్నది. వడ్డీ ఆదాయం అని చెప్పవచ్చు. మరొకసారి పెంచుకొనే అవకాశం ఉంటుంది. అంటే మరో ఐదేళ్లు పొడిగిస్తే మెచ్యూరిటీ సమయానికి దాదాపుగా మీ దగ్గర రూ.10,00,799 రూపాయలు సైతం మనం సంపాదించుకోవచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్ పథకం వల్ల అతి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బును సైతం మనం సంపాదించుకొనే వెలుసుబాట కలదు.