మనీ: మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులా.. ఈరోజు ఇలా చేసి చూడండి..!!
ఏ యుగంలోనైనా సూర్యుడుకు విశిష్టత కలిగి ఉన్నాడనే విషయం పురాణాల నుంచి వస్తూనే ఉంది. ఎవరైనా ఆరోగ్యకరమైన శరీరం, సంపద, శాంతి ఆనందం వంటివి కోరుకోవాలి అంటే ఆదివారం పూట సాయంత్రం వేళ కొన్ని ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి.. ఆదివారం సాయంత్రం రావి చెట్టు కింద దీపాలను వెలిగించడం వల్ల ఆ ఇంట్లో ఉన్న సమస్యలతో పాటు ఎంతో ఆనందాన్ని సైతం కలిగి ఉంటారు.. అయితే ఈ దీపాలు నాలుగు దిక్కుల నాలుగు ముఖాలుగా ఉండాలని గుర్తించుకోవాలి..
ఎవరైనా వ్యాపార రంగంలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఆదివారం రోజున శనీశ్వరుడిని ఆరాధించడం వల్ల వ్యాపారం లో కూడా మంచి లాభం చేకూరుతుంది..హిందూ ధర్మంలో దీని విశిష్టత చాలా ఎక్కువగానే ఉన్నది. ఆదివారం సాయంత్రం పూట నల్ల నువ్వులు నల్ల బట్టలు ఎండుమిర్చి ఇలాంటివి దానం చేయడం వలన జీవితంలో చాలా ఆనందం కలుగుతుంది.. ఎవరింట్లోనైనా సరే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపు రావి చెట్టు కింద దీపాలను వెలిగించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని పండితులు తెలుపుతున్నారు.