మనీ: ఆడపిల్లలు భవిష్యత్తుకు ముఖ్యమైన పథకాలు ఇవే..!!

Divya
భారతదేశంలో ప్రస్తుతం చాలామంది ప్రజలు పొదుపు వైపు గానే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు... పలు రకాల పథకాలలో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు.ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చులు అనే పద్యంలో ఆడ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే కోరికతోనే చాలామంది పొదుపు చేసుకుంటున్నాట్లు కొన్ని నివేదికలు తెలియజేశాయి. అయితే భారత ప్రభుత్వం ఆడపిల్లల కోసమే సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కూడా తీసుకురావడం జరిగినది.. మ్యూచువల్ ఫండ్ బంగారం రియల్ ఎస్టేట్ ఇతరత్రా వంటి వాటిలోని కీలకమైన పెట్టుబడి ఉంటున్నాయని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.అయితే వీటిలో దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యం పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయట ఇలాంటి పథకాల గురించి ఒకసారి తెలుసుకుందాం.



సుకన్య సమృద్ధి యోజన:
ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం మాత్రమే రూపొందించారు. ఈ పథకంలో అధిక వడ్డీరేట్ల తో పాటు పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తూ ఉంటుంది.


ఫిక్స్డ్ డిపాజిట్:
Fd లో పెట్టుబడుడు పెట్టడం అనేది చాలా సురక్షితమైన ఎంపిక.. అయితే ఇందులో హామీతో కూడిన రాబడి కూడా వస్తుందట. అయితే ఇతర ఎంపికలతో పోలిస్తే కాస్త వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

పోస్ట్ ఆఫీస్ డిపాజిట్:
మనం పోస్ట్ ఆఫీస్ స్కీములలో పెట్టుబడి కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది తల్లితండ్రులు తమ కుమార్తె భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో రెగ్యులర్గా డిపాజిట్లు చేయడానికి సైతం అనుకూలంగానే ఉంటుంది. ఈ పథకంలో స్థిర వడ్డీ రేట్లు పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి.

బంగారంలో పెట్టుబడి:
మన బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే ఇది భారతదేశంలోని బాలికలకు చాలా సాంప్రదాయంగా వస్తూ ఉన్న ఉన్న పథకం ఈ పెట్టుబడి చాలా సురక్షితమైన ఆస్తిగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు.


ఇక ఇవే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ తదితర వాటిలో కూడా మన ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: