మనీ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

Divya
కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఉద్యోగులపైన ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. వీరి కోసం పలు పథకాలను కూడా తీసుకువస్తోంది. తాజాగా కోటి మంది ఉద్యోగుల పింఛనుదారులకు శుభవార్త తీసుకువచ్చింది. ప్రస్తుతం అంగీకరించిన ఫార్ములా ప్రకారం కరువు భత్యం (DA) మరో నాలుగు శాతాన్ని పెంచపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం 38% ఉన్న డీఎ ను 42 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలో లేబర్ బ్యూరో ప్రతినెలా కూడా పారిశ్రామిక కార్మికుల కోసం ధరలను రూపొందిస్తూ ఉంటుంది. వీటి ఆధారంగానే ఉద్యోగులకు పింఛనిదారులకు DA ను నిర్ణయిస్తున్నట్లు సమాచారం.
ఆలిండియా రైల్వే మాన్ ఫెడరేషన్ కార్యదర్శి శివగోపాల్ మేస్త్రి తాజాగా ఒక వార్త మీడియా సంస్థతో మాట్లాడుతూ డిసెంబర్ -2022 న cpi -IW 2023 జనవరి 31న విడుదలైందని తెలియజేశారు. DA పెంపు 4.23 గా లెక్కలు చెబుతున్నాయని తెలియజేశారు. అయితే  ఉన్నదానిలో పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదని తెలియజేశారు. అందువల్లే DA 4 శాతం తిరగవచ్చు అని కూడా తెలియజేయడం జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యవసాయా శాఖ ఈ DA ను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని తెలియజేశారు . ఈ పెంపు వల్ల భరించాల్సిన పర్యవసానాలను వివరిస్తుందని తెలియజేయడం జరిగింది ఇందుకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం వేచి చూస్తున్నారు.

ఒకవేళ DA ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లయితే.. పెంచిన DA ను 2023 జనవరి ఒకటి నుంచి వర్తిస్తుందట . అయితే 12 నెలల వారి ధరల సగటు ఆధారంగా ఈ డీఎన్ నిర్ణయించబోతున్నట్లు తెలుస్తోంది. అప్పుడు కూడా నాలుగు శాతమే పెంచడం జరిగింది.  పెరిగిన ధరల భారానికి పరిహారంగానే  ఈ  DA ప్రభుత్వం చెల్లిస్తోందని సమాచారం. కొంతకాలంలో జీవన వ్యయం పెరుగుతూ ఉండడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: