రోజూ మనం చేసే పొరపాట్లే దరిద్రానికి కారణమా ?
అయితే ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే లక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోవాలి, మాతకు కోపం తెప్పించకుండా చూసుకోవాలి. అవేంటో ఇపుడు చూద్దాం. నిత్యం మనం చేసే చిన్ని పొరపాట్లు కారణంగా లక్ష్మి దేవికి ఆగ్రహం తెప్పించి అనుగ్రహానికి దూరం చేస్తాయి. అవేంటో తెలుసుకుని వాటిని సరి చేసుకుంటే లక్ష్మి మాత కటాక్షం తప్పక పొందవచ్చు అని వేద పండితులు చెబుతున్నారు.
రోలు, రోకలి, పొయ్యి, చీపురు ఇవి అన్ని కూడా మంగళకరమైన వస్తువులు. వీటిని పవిత్రంగా చూసుకోవాలి వీటికి కాలు తగలకూడదు. అలాగే వంటిల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం చేశాకే గ్యాస్ ను ముట్టుకోవాలి. అలాగే వంట అయ్యాక వంట గదిని నీట్ గా క్లీన్ చేసుకోవాలి లేదంటే దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే మంచంపై కూర్చుని అన్నం తినకూడదు. లక్ష్మీ దేవి ప్రతి రూపంగా భావించే చీపురు ను పవిత్రంగా చూసుకోవాలి. లేదంటే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చై పోతుందట.