మనీ: రైతులకు శుభవార్త.. వారి ఖాతాలో రూ.2 వేలు జమ..!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద సంవత్సరానికి ఒక రైతు ఖాతాలో ఆరు వేల రూపాయలను 3 విడుతల గా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారుగా రూ. 11 కోట్ల మంది రైతులు డేటా వెరిఫై అయ్యింది అని వ్యవసాయ శాఖ అధికారి వెల్లడించారు. అంతేకాదు ఈ సందర్భంగా ఈ కేవైసీ చేయించుకోవాలని కూడా రైతులకు సూచించడం జరిగింది. ఇక పోతే ఈ పథకం కింద సుమారు 22వేల కోట్ల రూపాయలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. కాబట్టి మీరు కూడా మీ యొక్క స్టేటస్ లను పూర్తిగా చెక్ చేస్తూ ఉండండి.
ఇక ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే.. ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క వెబ్సైట్పై క్లిక్ చేయండి.
ఇందులో కుడివైపున ‘ఫార్మర్స్ కార్నర్’ కనిపిస్తోంది. ఇందులో బెనిఫిషియరీ స్టేటస్పై మీరు క్లిక్ చేయండి.
ఇందులో ఆధార్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీ స్టేటస్ యొక్క తనిఖీ చేయవచ్చు. ఏదైనా సమస్య ఉన్నా మీకు తెలుస్తుంది.
ఇక ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖను వెంటనే సంప్రదించవచ్చు. PM కిసాన్ హెల్ప్లైన్ నంబర్ 155261 మరియు 011-24300606. కాల్ కూడా చేయవచ్చు.