మనీ: రైతులను కోటీశ్వరులను చేసే అద్భుతమైన వ్యాపారం..!!

Divya
ఇటీవల కాలంలో చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది రైతులను దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైన పంటను రైతుల కోసం తీసుకురావడం జరిగింది.  ఈ పంటకు సుమారుగా కిలో కి వెయ్యి రూపాయల వరకు లాభం పొందవచ్చు. ఇకపోతే సాధారణంగా పసుపును పండించడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాధారణ పసుపు తో పోల్చుకుంటే నల్ల పసుపు దిగుబడి కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ రేటు మాత్రం ఎక్కువగా ఉండడం వల్ల అధిక లాభాలు కూడా వస్తాయి. అంతేకాదు నల్ల పసుపు ధర కిలో 1000 రూపాయల వరకు పలుకుతూ ఉండడం గమనార్హం. బాగా చదువుకున్న వారు కూడా సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ వ్యవసాయం చేస్తున్న విషయం తెలిసిందే.
సొంత ఊరిలో పచ్చటి పొలాల మధ్య తిరుగుతూ డబ్బు కూడా బాగా సంపాదిస్తున్నారు. వ్యవసాయం చేయాలని ఆలోచిస్తున్నట్లు అయితే వినూత్నంగా ఆలోచించడం తప్పనిసరి .ఈ నేపథ్యంలో ని నల్ల పసుపు పంట మంచి దిగుబడి కూడా అందిస్తుంది. ఇకపోతే ఈ పంటను ఎంతో మంది రైతులు పండిస్తూ ఇప్పటికే కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. ఇక దీనిని ఎలా సాగు చేయాలి..?  ఆదాయం ఎలా వస్తుంది..?  అనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల పసుపును కూడా సాధారణ పసుపు మొక్క లాగే పెంచవచ్చు. ఇక ఈ ఆకుల మధ్యలో నల్లటి గీతలు ఏర్పడతాయి . దుంపలు లోపలి నుంచి పసుపు రంగులో కాకుండా ఊదా.. నలుపు రంగులో మనకు కనిపిస్తాయి. సాగు చేయడానికి జూన్ నెల ఎంతో అనువుగా ఉంటుంది కాబట్టి ఫ్రైబుల్ లోమ్ నేలలో ఇది బాగా పండుతుంది వర్షపు.. నీరు నిలిచి పోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని..పొలంలో సుమారుగా రెండు క్వింటాల్ ల నల్ల పసుపు విత్తనాలను నాటాల్సి ఉంటుంది. క్రిమిసంహారక మందులు కూడా వాడాల్సి అవసరం ఉండదు.  పేడ తో తయారైన ఎరువు వేస్తే నల్ల పసుపు పంట దిగుబడి కూడా బాగా అందిస్తుంది. ప్రస్తుతం కిలో 1000 రూపాయలు పలుకుతోంది .. ధర అధికంగా ఉంటుంది అంతే కాదు మంచి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: