మనీ: రూ.5 లక్షల లోపు దొరికే బెస్ట్ కార్ ఇదే.!
దేశీయ వాహన తయారీ దిగ్గజం అయినటువంటి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మొదటిసారి ఇండియాలో సరికొత్త సెలేరియో మోడల్ ను ఆవిష్కరించింది. 2014లోనే విడుదలైన ఈ కార్ లో తాజాగా కొన్ని మార్పులు చేసి మరోసారి లాంచ్ చేసింది సుజుకి. ముఖ్యంగా మార్కెట్లో పోటీ కోసం ఇందులో చాలా రకాల అప్డేటెడ్ ఫీచర్లను కూడా జోడించింది. తాజాగా విడుదలైన ఈ మోడల్ పెట్రోల్ వేరియంట్ తో విడుదలైంది కాబట్టి 26.68కేఎంపిఎల్ మైలేజ్ కూడా ఇస్తుంది. 2014లో విడుదలైన ఈ కారు ఏడాదిలోపే 5.9 లక్షల యూనిట్ల కార్లను విక్రయించింది.
ఇకపోతే ఈ మారుతి సుజుకి సెలెరియో మోడల్ ఫీచర్ల విషయానికి వస్తే.. సుజుకి సెలెరియో పాత మోడల్ కంటే ఇప్పుడు ఆకారంలో కూడా చాలా విశాలంగా ఉంటుంది.. ముందుకంటే ఇప్పుడు పూర్తిగా రీడిజైన్ చేసి మార్కెట్లోకి విడుదల చేశారు.. ఇక ముందు భాగంలో క్రోమ్ యాక్సిడెంట్లు.. సుజుకి లోగో తో కూడిన ఒక గ్రిల్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రతి డోర్ పై కూడా లిఫ్ట్ టూ ఓపెన్ టైప్ హ్యాండిల్స్ ను డిజైన్ చేశారు.. అంతే కాదు బ్యాక్ కెమెరా ని కూడా అమర్చడం జరిగింది. అంతేకాదు డాష్ బోర్డు లో పవర్ విండోస్ స్విచ్ లను కూడా చేర్చారు.