మనీ : ఈ పాలసీ కేవలం ఆడపిల్లలకు మాత్రమే.. బంగారు భవిష్యత్తుకు పునాది..!
ఈ నేపథ్యంలోనే ఎవరికైతే కూతురు జన్మించి, ఉంటుందో అలాంటి వారు జీవన్ లక్ష్య పాలసీ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలను పొందవచ్చు అని చెప్పవచ్చు. కూతురు పేరు మీద ఈ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ పాప పెద్దయ్యాక చదువుల కోసమో లేక పెళ్లి కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ఇతర పాలసీలతో పోల్చుకుంటే ఈ పాలసీ చాలా మంచి రాబడిని అందిస్తుంది. ఈ పథకంలో ఎవరైతే చేరుతారో వాళ్లకు మెచ్యూరిటీ సమయం తర్వాత డబ్బులు అధిక మొత్తంలో పొందే వీలు ఉంటుంది.
ఇకపోతే మధ్యలోనే పాలసీదారు దురదృష్టవశాత్తు చనిపోతే , ఇక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు నిర్ణీత కాలం ఉన్నంతవరకు పాలసీలో పది శాతం రాబడిని కూడా పొందే అవకాశం ఉంటుంది. 13 యేళ్ళ నుంచి 25 యేళ్ళ లోపు ఉన్న ఆడపిల్లలు ఈ పథకంలో చేరడానికి అర్హులు. అంతేకాదు ఈ పాలసీ లో చేరిన తరువాత ఇరవై నాలుగు నెలలు గడిచిన తర్వాత లోను కూడా తీసుకునే వెసులుబాటు కల్పించబడింది. ఇందులో రోజుకు 125 రూపాయలు చొప్పున ఆదా చేస్తూ పోవడం వల్ల మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 27 లక్షల రూపాయలను పొందే వీలు ఉంటుంది. అయితే 10 లక్షల రూపాయల విలువ గల బీమా మొత్తానికి పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది.