మనీ : ఇందులో చేరితే నెలకు రూ.10 వేలు..
సాధారణంగా ఎవరికైనా డబ్బు అంటే ఆశ ఉండడం సహజం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు అనేది నిత్య అవసరం. డబ్బు లేనిదే మనం ఏమీ తినలేము.. తాగలేము.. కూడా.. కనీసం మంచినీరు తాగాలన్నా సరే డబ్బు పెట్టి మరీ కొనుక్కొని తాగే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితే ఇలా ఉంటే, ఇక భావితరాల పరిస్థితి ఎలా ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే డబ్బు ఆదా చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు డబ్బు ఆదా చేయడం వల్ల రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండవచ్చు. ఇక ఇందుకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు , బ్యాంకులు, పోస్టాఫీసులు కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. వీటిలో మనం ప్రతి నెలా కొంత మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేయడం వల్ల కాల వ్యవధి ముగిసిన తర్వాత ప్రతి నెల కొంత మొత్తంలో డబ్బులు పొందవచ్చు. అయితే ఆ పథకాల యొక్క వివరాలు తెలుసుకుందాం.
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ఈ బ్యాంక్ ప్రస్తుతం ఒక అదిరిపోయే స్కీమ్ ను అందిస్తోంది. ఈ స్కీమ్ లో చేరడం వల్ల ప్రతినెలా రూ.10 వేల రూపాయలను పెన్షన్ కింద పొందవచ్చు. ఈ స్కీమ్ పేరే ఎస్బిఐ యాన్యుటీ స్కీమ్. ఇక ఈ స్కీమ్ లో నాలుగు రకాలు టెన్యూర్ ప్లాన్ లు అందుబాటులో ఉన్నాయి. 36 నెలలు, 60 నెలలు, 80 నెలలు, 120 నెలలు. ఇక ఈ నాలుగు ఆప్షన్లలో మీకు నచ్చిన ఒక ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఇక ఇందులో మామూలు టర్మ్ డిపాజిట్లకు లభించే వడ్డీ రేట్లు కూడా ఇక్కడ లభిస్తాయి.
ఇక ఇందులో ముఖ్యంగా మీరు ఎంచుకునే కాల వ్యవధిని బట్టి డబ్బులు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు మీరు ప్రతి నెల 10 వేల రూపాయలను పెన్షన్ కింద పొందాలనుకుంటే, అందుకోసం మీరు రూ.5.07 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇందుకోసం 7 శాతం వడ్డీ రేటు కూడా లభిస్తుంది. అంటే మీరు డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ రేటు కలిపి మీకు ప్రతి నెల పదివేల రూపాయల పెన్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక సీనియర్ సిటిజన్స్ అయితే అదనపు వడ్డీ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు.