మనీ: కరోనా సమయంలో రూ.50 వేల వరకు సంపాదించే అవకాశం..

Divya

ఈ కరోనా  సమయంలో చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. అయితే ఆర్థికంగా మెరుగుపడాలంటే ఇప్పుడు చెప్పబోయే సరైన వ్యాపారం మీకోసమే.. వేసవి కాలం రాగానే చాలా వరకూ వాటర్ బాటిల్స్ కు ఎక్కడలేని డిమాండ్ పెరుగుతుంది. కరోనా వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ వాడకం బాగా పెరిగింది. ఇక ప్రజలు కుండలు, హోటళ్లలో దాదాపు నీరు తాగడం మానేశారు. ఎవరికివారు సొంతంగా కొనుక్కొని మరీ తాగుతున్నారు. అందుకే ఈ వాటర్ బాటిల్ వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. సాధారణ ఫిల్టర్ చేసిన నీటికి 20 రూపాయల వరకు ధర ఉంటుంది. 20 లీటర్ల క్యాన్ లకు డిమాండ్ భారీగానే ఉంది. అందువల్ల ఇలాంటి వ్యాపారం చేసే వారికి లాభాలు బాగానే ఉంటాయి.

కొత్త ఏడాది ఏదైనా వ్యాపారం చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మీరు కంపెనీ ప్రారంభించాలంటే, కంపెనీ చట్టప్రకారం మీ కంపెనీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పేరు కూడా బాగా సింపుల్ గా, అందరి నోట పలికేలా ఉండాలి. మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ అయ్యాక.. మీ పాన్ కార్డు, జీ ఎస్ టీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక వాటర్ ప్లాంట్ కోసం మీకు 1000 నుంచి 1500 చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది. అందులోనే బోరు వేసుకోవాలి .అలాగే RO చిల్లర్ మిషన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాటర్ స్టోరేజ్ చేసుకోడానికి ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

వాటర్ ప్లాంట్ ప్రారంభించడానికి  లైసెన్స్ కూడా పొందవలసి ఉంటుంది. అలాగే వాటర్ బాటిల్ లను ముద్రించేందుకు ఐ ఎస్ ఐ (isi) ప్రమాణం తప్పకుండా పొందాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ కు అయ్యే ఖర్చు రూ. 50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది.

ఈ వ్యాపారం చేసుకోవాలనుకునే వారు బ్యాంకు రుణం కూడా తీసుకోవచ్చు. బ్యాంకు వాళ్లు రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తాయి. ఈ ప్లాంట్ ద్వారా మీరు నెలకి రూ.50,000 వరకు సంపాదించుకోవచ్చు.

మనం ప్రతిరోజు 150 మంది రెగ్యులర్ కస్టమర్లను ఏర్పాటు చేసుకోగలిగితే, వారు రోజుకు ఒక క్యాన్ చొప్పున నీరు వాడుతున్నట్లయితే , మీరు  రోజుకి 150 క్యాన్ ల వాటర్ సరఫరా చేయగలరు. దీని ప్రకారం నెలకు 4,500 క్యాన్లు సరఫరా చేసినట్లు అయితే. ఒక్కో క్యాన్  బయట షాపుల్లో 40 రూపాయల వరకు ఉంటుంది. మీరు 25 రూపాయలకు ఇవ్వచ్చు. అలా ఇచ్చినా కూడా నెలకు 1.12 లక్షలు సంపాదించే అవకాశం ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: