పెళ్లి కాకుండా పిల్లల్ని కంటే తప్పేంటి అంటున్న శృతి హాసన్..!!

murali krishna
ఒకప్పుడు పెళ్లి అయిన తర్వాత మాత్రమే పిల్లల గురించి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే డేటింగ్ పేరుతో పిల్లల్ని కంటున్నారు.
 కనీసం వారి పిల్లలకి తండ్రి ఎవరు అన్న విషయాన్ని కూడా వారు బయట పెట్టడం లేదు చాలామంది .ఒకప్పుడు ఇతర దేశాలలో ఇలాంటివి ఎక్కువగా అయితే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా ఇలాంటివి రోజురోజుకీ బాగా పెరిగిపోతున్నాయి. ఇటీవల ఆలియా భట్ కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అమీ జాక్సన్ కూడా పెళ్లికి ముందే ఒక కొడుకుకి కూడా జన్మనిచ్చింది.
తాజాగా ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా కూడా పెళ్లికి ముందే గర్భవతి అంటూ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. అంతేకాదు ఇప్పటివరకు తన బిడ్డకు తండ్రి ఎవరు అన్న సంగతి మాత్రం ఇంకా రివిల్ చేయలేదు. ఇక ఇలాంటి సంఘటనలు రోజురోజుకీ ఎక్కువ అవ్వడంతో ఈ విషయాలపై స్పందించింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన శృతిహాసన్. ఈ విషయంపై షాకింగ్ కామెంట్లు కూడా చేసింది. అయితే ఇప్పటివరకు శృతిహాసన్ చాలామందితో డేటింగ్ ను చేసింది. తాజాగా ఇప్పుడు శాంతను హాజరికతో ఉంది శృతిహాసన్. అంతేకాదు ప్రస్తుతం వారిద్దరూ ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు కూడా ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు.
ఇందులో భాగంగానే ఆమెకి ఒక ప్రశ్న కూడా ఎదురయింది. పెళ్లికి ముందు పిల్లల్ని కనడాన్ని గురించి మీరు ఎలా స్పందిస్తారు అని అడిగింది యాంకర్.. ఇందుకు శృతిహాసన్ స్పందిస్తూ.. ఇందులో తప్పేముంది.. పిల్లల్ని కనే హక్కు ఆడవారికి మాత్రమే ఉందని కాబట్టి ఎప్పుడు కనాలి అనేది కూడా వారి నిర్ణయం.. నేను దాన్ని ఎప్పుడూ గౌరవిస్తాను.. ఆడవారి స్వేచ్ఛకు సమాజం గౌరవం ఇచ్చి తీరాలి.. దాని అవసరం కూడా ఎంతైనా ఉంది ..అంటూ షాకింగ్ కామెంట్స్ ను చేసింది శృతిహాసన్. దీంతో పెళ్లికి ముందు పిల్లల్ని కన్నడంపై శృతిహాసన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతున్నాయి.. దీన్ని బట్టి చూస్తే ఆమె కూడా పెళ్లికి ముందే పిల్లల్ని కనాలి అన్నట్టుగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: