రామ్ చరణ్- ఆలియా భట్ ను కాదని మరో బ్రాండ్ కు రష్మిక..!!

Divya
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు.. గడచిన కొన్ని సంవత్సరాల నుంచి ఇతర భాషలలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో ముందుగా అభిమానులు ఇమేను నేషనల్ క్రష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. గత కొద్ది రోజులుగా రష్మిక నిరంతరం వార్తలలోనే నిలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈమె లవ్ వ్యవహారం పెళ్లి వ్యవహారం వల్ల తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది. అప్పుడప్పుడు వెకేషన్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ ట్రోల్ కి గురైన సందర్భాలు ఉన్నాయి.

రష్మిక పలు రకాల యాడ్ల ద్వారా సినిమాల ద్వారా , వ్యాపారాల ద్వారా బాగానే సంపాదిస్తోంది.తరచూ ఎక్కువగా పలు వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూనే ఉంది.  పలు వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూనే ఉంది. గత కొద్ది రోజుల క్రితం 7 UP బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించిన రష్మిక ఇప్పుడు తాజాగా మ్యాంగో ఫ్రూట్ యాడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా  కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ యాడ్ కు ఆలియా భట్, రామ్ చరణ్ కలిసి  కనిపించారు. ఈసారి ఈ యాడ్ లో రష్మిక కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా రష్మిక సినిమాలు ఈ మధ్యకాలంలో  పెద్దగా సక్సెస్  కాలేకపోతున్నాయి. అయినప్పటికీ కూడా తన క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. రష్మిక ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే పుష్ప-2 సినిమాతోపాటు బాలీవుడ్లో యానిమల్ అనే చిత్రంలో నటిస్తోంది. మరొక పాన్ ఇండియా చిత్రంలో అతిధి పాత్రలో కూడా కనిపించబోతున్నట్లు గత కొద్దిరోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి రష్మిక ఈ ఏడాదైనా సరైన సక్సెస్ తో అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుందేమో చూడాలి మరి. రష్మిక కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: