ఆ హీరోయిన్ కోసం రంగంలోకి దిగిన పోలీసులు....!!

murali krishna
స్టార్‌ హీరోయిన్‌ ఒకరు గత రెండు రోజులుగా కనిపించడం లేదనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. మరి ఇంతకు ఆ హీరోయిన్‌ ఎక్కడికి వెళ్లింది.. ఆమెను ఎవరైనా కిడ్నాప్‌ చేశారా అంటే..
హీరోయిన్‌ సునయన.. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. క్యూట్‌ లుక్స్‌తో.. కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది. కుమారి వర్సెస్‌ కుమారి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తాజాగా విశాల్‌ లాఠీ చిత్రంలో కూడా నటించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో సునయనకు సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది. అది ఏంటంటే.. గత రెండు రోజులుగా ఈ నటి కనిపించడం లేదంట. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇదే వార్త ట్రెండింగ్‌లో నిలిచింది. సునయన మొబైల్‌ ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ వస్తుంది. గత రెండు రోజులుగా ఈ నటి సోషల్‌ మీడియాలో కూడా ఎలాంటి పోస్ట్‌ చేయలేదు. దాంతో అభిమానులు సునయనకు ఏం జరిగిందో తెలియక కంగారు పడుతున్నారు. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి చేరడంతో.. వారు సునయనను వెతకడం కోసం రంగంలోకి దిగారు. మరి ఇంతకు ఏం జరిగింది.. సునయన ఎక్కడకు వెళ్లింది.. ఆమెను ఎవరైనా కిడ్నాప్‌ చేశారా.. అంటే..
2008లో వాళండిల్‌ కాల్తేనే అనే తమిళ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సునయన. ఆమె సినిమాల్లోకి వచ్చి సుమారు 15 ఏళ్లు అవుతున్నా.. సాలిడ్‌ హిట్‌ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం సునయన ఎయిరా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న రెజీనా అనే మూవీలో యాక్ట్‌ చేస్తోంది. దాదాపు 4 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే సినిమా రిలీజ్‌ ఉండగా.. తాజాగా సునయన కనిపించడం లేదనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌ సహా ఇతర సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో ఎక్కడా కనిపించడం లేదని.. ఆమె ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ వస్తుందని ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
దాంతో సునయన మిస్సింగ్‌, కిడ్నాప్‌ అంటూ వార్తలు వచ్చాయి. ఆమె ఫ్యాన్స్‌ సునయనకు ఏం జరిగిందో తెలియక కంగారు పడుతున్నారు. ఈ వార్త కాస్త పోలీసుల దృష్టికి చేరడంతో.. వారు సునయన కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎగ్మూర్‌ నుంగంబాక్కం, కోయంబేడు, విరుగంబాక్కం ప్రాంతాల్లో సునయన సంచరించిందన్న సమాచారం తెలియడంతో.. ఆ ప్రాంతాలకు వెళ్లి ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. తర్వాత వలసరవకలోని ఆమె ఇంటికి వెళ్లి వెతికారు. ఆమె నటించిన సినీ నిర్మాణ సంస్థలను కూడా ఆరా తీశారు. అంతేకాక గత రెండు రోజులుగా ఆమె ఎక్కడ తిరిగిందన్న విషయాలను సేకరించే పనిలో ఉన్నారు.
పోలీసులు సునయన కోసం వెతుకుతుండగానే ఓ షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. ఇదంతా సినిమా ప్రమోషన్‌లో భాగం అంటూ చావు కబురు చల్లగా చెప్పారు చిత్ర యూనిట్‌. రెండు రోజులుగా జనాలను, పోలీసులను కంగారు పెట్టారు కదా అంటూ మండి పడుతున్నారు నెటిజనులు. సినిమా ప్రమోషన్‌ కోసం మరి ఇంత దిగజారాలా అంటూ విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: