"నువ్వే కావాలి" మూవీని మిస్ చేసుకున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా..!

Pulgam Srinivas
అప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న తరుణ్ ... కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందినటువంటి నువ్వే కావాలి మూవీ తో ఫుల్ లెన్త్ హీరోగా మారాడు. ఈ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను అందించగా ... ఈ మూవీ లో తరుణ్ సరసన రీచా హీరోయిన్ గా నటించింది. కోటి ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ 13 అక్టోబర్ 2000 సంవత్సరం మంచి అంచనాల నడుమ విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా కథను మొదటగా తరుణ్ కు కాకుండా మరో ఇద్దరు హీరోలకు వినిపించారట. ఆ ఇద్దరు హీరోలు ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాను తరుణ్ తో నిర్మించింది అంట. నువ్వే కావాలి మూవీ ని ఏ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసుకుందాం.

నువ్వే కావాలి సినిమా కథ మొత్తం పూర్తి అయిన తర్వాత మొదటగా మహేష్ బాబుకు వినిపించారట. కానీ మహేష్ నుండి చాలా రోజులు అయిన ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇదే కథను సుమంత్ కు వినిపించారట. సుమంత్ కు ఈ సినిమా కథ బాగా అనిపించినప్పటికీ ... అదే సమయంలో ఇతర మూవీ లతో ఈ హీరో బిజీగా ఉండడం వల్ల చేయలేను అని చెప్పాడట. దానితో తరుణ్ కు ఈ మూవీ కథను వినిపించడం ... తరుణ్ కి ఈ సినిమా కథ బాగా నచ్చడంతో వెంటనే ఈ మూవీ ఓకే అయ్యిందట. అలా మహేష్ ... సుమంత్ తో అనుకున్న ఈ సినిమా తరుణ్ తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: