ఛార్మి తో లైగర్ వివాదం ముగిసినట్టేనా..?

Divya
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా గత ఏడాది విడుదలై ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది. ఈ సినిమాపై హీరో విజయ్ దేవరకొండ తో పాటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాత ఛార్మి కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు.కానీ వీరి ఆశలన్నీ నిరాశలుగా మిగిలాయి. ఈ సినిమాకి ఊహించని షాక్ తగిలింది. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో ఈ సినిమా కొన్న బయ్యర్ల చాలా నష్టపోయామంటూ ధర్నాలు కూడా చేయడం జరుగుతోంది. అప్పటినుంచి బయ్యర్లు ఎగ్జిక్యూటర్లు తమకు జరిగిన నష్టాన్ని కూర్చోమంటూ పూరి చార్మిలను సైతం కోరుతూ ఉన్నారు.

అయితే పూరి గాని చార్మి కానీ ఈ విషయంపై స్పందించకపోవడంతో వారు ధర్నా కూడా చేయడం జరిగింది. అయినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. పైగా పూరి వార్నింగ్ ఇచ్చామంటు ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని ఆ తర్వాత పూరి ఎగ్జిక్యూటర్లకు మాటిచ్చాడు అంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఈ వీవాదం ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే ఈ విషయాన్ని మర్చిపోయారు కానీ హామీ ఇచ్చి ఆరు నెలలు కావస్తున్న ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇటీవల మల్లి బయ్యర్లు నిరాహార దీక్ష చేయడం జరిగింది.

ఈ వివాదం తీవ్రత ఎక్కువ అవ్వడంతో పూరి ఛార్మి కూడా పట్టించుకోలేదు. తాజాగా వీరు ఈ విషయంలో దిగాల్సి వచ్చింది ఈ విషయంలో ఫిలిం ఛాంబర్ లో పెద్దలు జోక్యం చేసుకోవడంతో మాట్లాడటం వల్ల ఛార్మి వ్యవహారం చెక్క పెట్టేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఎట్టకేలకు ఈ వివాదం నిన్నటితో ముగిసింది బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తాం అంటూ ఛార్మి హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే వీరికి నష్టపరిహారం చెల్లిస్తామని ఫిలిం చాంబర్ కు ఛార్మి మెయిల్ పెట్టినట్టుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాధిత బజార్లను ఎగ్జిబిటర్లు నిరాహార దీక్షను విరమించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: