పవన్ కళ్యాణ్ అసెంబ్లీ లో ఆ మాట అంటే వినాలని వుంది : పృద్విరాజ్
అయితే గత ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీ విజయానికి దోహదపడిన పృథ్వీ రాజ్ కి వైసిపి ప్రభుత్వం ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా పదవి కూడా అప్పజెప్పారు. అయితే ఈయన ఫోన్ కాల్ లీక్ అవడంతో ఈ పార్టీ నుంచి తనని సస్పెండ్ చేశారట.అనంతరం జనసేన పార్టీకి ఆయన మద్దతు ప్రకటించారు.
ఇలా జనసేన పార్టీలోకి వచ్చినటువంటి పృథ్వీరాజ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన పలు విషయాల గురించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ...మెగా కుటుంబంతో తనకు విభేదాలు ఉన్నాయనే వార్తలలో ఏమాత్రం కూడా వాస్తవం లేదని తెలిపారు. అలాగే గత కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా రజనీకాంత్ పట్ల వైసిపి నేతలు విమర్శించిన తీరును ఈయన బాగా తప్పుపట్టారు.రజనీకాంత్ గారిని విమర్శించేవారు ఆయన ఇంట్లో కుక్క కాలిగోటికి కూడా సరిపోరు అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక జనసేన పార్టీ తరపున మీరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అంటూ ప్రశ్నించడంతో తాను ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయడానికి ఆసక్తి లేనని జనసేన పార్టీ కోసం శ్రమిస్తున్నటువంటి కార్యకర్తలకు నేతలకు తన వంతు సహాయం చేస్తూ వారి గెలుపుకు మద్దతు ప్రకటిస్తానని ఈ సందర్భంగా పృథ్విరాజ్ తెలిపారట.ఇక పవన్ కళ్యాణ్ గెలుపొంది అసెంబ్లీలో అధ్యక్ష అనేమాట నాకు వినాలని ఉందని, ఆ మాటతో నా జన్మ ధన్యమైపోతుంది అంటూ ఈ సందర్భంగా పృథ్వీరాజ్ జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.