అఫీషియల్ : వైష్ణవ్ తేజ్ 4వ మూవీకి ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఉప్పెన మూవీ తో హీరో గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందినటువంటి కొండపొలం అనే నైవిద్యమైన సినిమాలో వైష్ణవ్ హీరో గా నటించాడు. ఈ మూవీ లో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.
 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ తర్వాత ఈ యువ నటుడు రంగ రంగ వైభవంగా అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.  మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ యువ హీరోకు అపజయాన్ని అందించింది. ఈ సినిమాలో హాటెస్ట్ బ్యూటీ కేతుగా శర్మ హీరోయిన్ గా నటించింది. ఉప్పెన మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత వరసగా రెండు మూవీ లతో అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం శ్రీకాంత్ ఎం రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ వైష్ణవ్ కెరియర్ లో 4 వ మూవీ గా రూపొందుతుంది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ బృందం ఈ సినిమాకు జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ తో వైష్ణవ్ తేజ్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: