పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివ కార్తికేయన్ 21 వ సినిమా..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటు లలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ ఆఖరుగా అనుదీప్ కేవీ దర్శకత్వం లో రూపొందిన ప్రిన్స్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాష ల్లో ఒకే రోజు విడుదల అయింది. కామెడీ ప్రాధాన్యత ఎక్కువ గల ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ఈ మూవీ ప్రేక్ష కాల అంచనాలను అందుకో లేక పోయింది. దానితో చివర గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయా న్ని అందుకుంది.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ హీరో మా వీరన్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు లో మహా వీరుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తం గా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికం గా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా శివ కార్తికేయన్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
 

 శివ కార్తికేయన్ కెరియర్ లో ఈ సినిమా 21 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుండగా రాజ్ కుమార్ పెరియసామి ఈ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు . జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది . ఈ మూవీ పూజా కార్యక్రమాలకు లోక నాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: