కార్ నుండి ఆటో స్థాయి కి పడిపోయిన స్టార్ హీరోయిన్...!!

murali krishna
మామూలు గా కొన్ని కొన్ని సార్లు సెలబ్రెటీలు సరదా కోసం తమ లగ్జరీ కార్లు వదిలి బైకులపై, ఆటోలలో ప్రయాణిస్తూ ఉంటారు. లగ్జరీ కార్లు ఉన్నా కూడా అలా సామాన్య వ్యక్తులు లాగా ప్రయాణించటం చూడముచ్చటగా అనిపిస్తుంది.
ఇప్పుడు అటువంటిదే టాలీవుడ్ బుట్ట బొమ్మ కూడా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. టాలీవుడ్ బుట్ట బొమ్మ అంటే వెంటనే గుర్తుకొచ్చే బ్యూటీ పూజా హెగ్డే.
ఎన్నో సినిమాల లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇక అలా వైకుంఠపురం లో సినిమా తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతోనే బుట్ట బొమ్మగా నిలిచింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టుల తో బాగా బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదిక గా ఒక ఫోటో షేర్ చేసుకోగా అందులో తను ఆటోలో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. అయితే తను ప్రస్తుతం శ్రీలంక ట్రిప్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భం గా ఆమె అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు చూడటం కోసం ఎటువంటి ఏసీ కారు బుక్ చేసుకోకుండా కేవలం చిన్న ఆటో ద్వారా ప్రయాణిస్తూ కనిపించింది.
ఇక అందులో తను క్యూట్ గా నవ్వుతూ కనిపించింది. ఆ ఫోటో చూసిన జనాలు ఆమె ఆటో లో ప్రయాణించడాని కి చూసి మురిసిపోతున్నారు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయాని కి వస్తే.. మహేష్ బాబు తో ఓ సినిమా లో నటించడానికి సిద్ధంగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ తో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ లో అవకాశాలు అందుకున్నట్లు వార్తలయితే వినిపించాయి. బాలీవుడ్ లో ఓ సినిమాలో నటించగా ఆ సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: