ఆరుగురు పతివ్రతలు బ్యూటీ.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

praveen
సాధారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పుడు నిలిచిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా ఎవరు ఊహకందని కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మదిలో గుర్తుండిపోయిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ఆరుగురు ప్రతివ్రతలు సినిమా. అది కూడా కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు ఈవివి సత్యనారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

 సాధారణంగా ఈవివి అంటే కామెడీ సినిమాలకు ఒక బ్రాండ్ అని చెప్పాలి. అలాంటి వ్యక్తి ఏకంగా ఆరుగురు పతివ్రతలు అనే సినిమా తీయటం అప్పట్లో  సెన్సేషన్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా  ప్రేక్షకులకు గుర్తుండిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ముఖ్యంగా ఈ సినిమాల్లో మెయిన్ రోల్ లో నటించిన నటి అమృతను చూడగానే ప్రతి ఒక్కరికి ఆరుగురు ప్రతివ్రతలు సినిమానే గుర్తుకు వస్తూ ఉంటుంది. అయితే ఇక ఆరుగురు పతివ్రతలు సినిమాలో నటించిన అమృత ఇప్పుడు ఏం చేస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.

 కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అమృతను ఈవీవీ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 2004 లో వచ్చిన ఆరుగురు పతివ్రతలు మూవీ లో కాస్త బోల్డ్ సన్నివేశాలలో నటించింది అమృత. ఒకవైపు మొగుడు ఒకవైపు లవర్ మధ్య నలిగిపోయిన పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. అయితే 2009లో జోడి నెంబర్ వన్ అనే కన్నడ చిత్రం అమృతకు చివరి సినిమా. కాగా  ఆమె కెరియర్లో కేవలం ఎనిమిది సినిమాలు చేసింది. ఇక ప్రస్తుతం వెండితెరకు దూరమైన అమృత వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారట. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో ఆమె ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అన్న విషయంపై ఎప్పుడు నెటిజన్స్ గూగుల్లో గాలిస్తూనే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: