ఏజెంట్: అయ్యగారు ఆ టార్గెట్ కొడతారా?

Purushottham Vinay
అక్కినేని అఖిల్ హీరోగా సీనియర్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న తాజా మూవీ ఏజెంట్. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా హీరోయిన్ గా నటిస్తుండగా .. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.సినీ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ చిత్రబృందం దేశ వ్యాప్తంగా కూడా క్రేజీ డీల్ను లాక్ చేస్తోంది. ఇక తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా  నైజాం హక్కులను 10 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. అలాగే సీడెడ్ లో రూ.4.50 కోట్లు ఆంధ్రాలో రూ.14.80 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం తెలుస్తుంది. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రూ.29.30 కోట్ల బిజినెస్ అనేది ఈ సినిమాకి జరిగింది.ఇంకా అలాగే కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా కలుపుకొని ఈ సినిమా రూ.3.80 కోట్లు బిజినెస్ చేయగా.. ఓవర్సీస్ లో రూ.3.10 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం తెలుస్తోంది.


ఇంకా అలాగే ప్రపంచ వ్యాప్తంగా రూ.36.20 కోట్ల రూపాయల బిజినెస్ జరగ్గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మొత్తం రూ.37 కోట్లుగా ఫిక్స్ అయింది. మొత్తం సినిమా  బిజినెస్ రూ.36.20 కోట్లు జరగ్గా... 37 కోట్ల షేర్ వస్తే కానీ ఈ సినిమా హిట్ అవ్వదు.మంచి స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందించగా.. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సురేందర్ రెడ్డికి చెందిన సరెండర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ సినిమాకి రాగూల్ హెరియన్ థారుమాన్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా... అలాగే నవీన్ నూలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.ఏప్రిల్ 28వ తేదీన గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుంది ఎంత మేర కలెక్షన్లను సాధిస్తుందో తెలియాలంటే ఇంకా రెండు రోజులు ఆగాల్సిందే.ఈ సినిమా బుకింగ్స్ అయితే సోసోగా ఉన్నాయి. ఓపెనింగ్స్ పెద్దగా రాకపోవచ్చు. ఒకవేళ సినిమా హిట్ అయితే వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: