రామబాణం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రాకపై క్లారిటీ ఇచ్చిన గోపి చంద్..!!

murali krishna
గోపీచంద్ మంచి యాక్షన్ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు. అయితే ఇప్పటికి వరుస సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ సరైన హిట్ మాత్రం రావట్లేదు.

ఈ క్రమంలోనే ఈయన హిట్ కొట్టి చాలా ఏళ్ళు అయితే అవుతుంది. అందుకే ఒక్క హిట్ కోసం గోపీచంద్ తెగ ఎదురు చూస్తున్నాడు.

మరి ప్రస్తుతం గోపీచంద్ లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో పని చేస్తున్నాడట . గోపీచంద్ కెరీర్ లో ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గోపీచంద్ ఆ రేంజ్ లో మరో హిట్ అయితే అందుకోలేక పోయాడు. అందుకే ఈసారి ఎలాగైనా సరే హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడు.

డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ''రామబాణం'' ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్, టీజర్ ఆడియెన్స్ ను అలరించాయి.. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర అవుతున్న కొద్దీ ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసింది. వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ బాగా హడావిడి చేస్తున్నారు.. అయితే ఈ సినిమా కోసం గోపీచంద్ స్నేహితుడు ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాబోతున్నాడు అని నిన్నటి నుండి నెట్టింట వార్తలు తెగ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రూమర్స్ పై గోపీచంద్ స్పందిస్తూ.. ఎంత స్నేహితుడు అయిన కానీ పాన్ ఇండియా హీరోగా వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్న తనని ఇబ్బంది పెట్టాలని అయితే అనుకోవడం లేదని.. అందుకే ప్రభాస్ ఈ ఈవెంట్ కు రావడం లేదని క్లారిటీ అయితే ఇచ్చాడు. దీంతో ముందు నుండి వీరి మధ్య ఉన్న స్నేహం కారణంగా ప్రభాస్ వస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్న నేపథ్యంలో రావడం లేదని చెప్పి ఈ రూమర్స్ కు క్లారిటీ ఇచ్చాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం కొద్దిగా నిరాశ చెందారని తెలుస్తుంది.ఇదిలా ఉండగా రామబాణం సినిమాను మే 5న సమ్మర్ కానుకగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడట. హాట్ బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: