మహేష్ 28వ మూవీలో ఆ పాత్ర చాలా కీలకమట..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఏ మూవీ లో నటించినప్పటికీ ఆ మూవీ కి ప్రేక్షకుల్లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ నెలకొంటూ ఉంటుంది. అలాగే మహేష్ నటించిన సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా వస్తూ ఉంటాయి.

 ఆ రేంజ్ కలిగిన మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాలో శ్రీ లీల ... పూజా హెగ్డే ... మహేష్ సరసన హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ లో జయరామ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో మహేష్ తల్లి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు ... ఈ పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా నిలవబోతున్నట్లు ... అంత పవర్ఫుల్ పాత్ర కావడంతో ఈ పాత్రలో చాలా పవర్ఫుల్ నటిని తీసుకోవాలి అని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు ... అందులో భాగంగా బాలీవుడ్ నటి రేఖను గానీ ... విజయశాంతి ని గాని ఈ పాత్రకు తీసుకుంటే బాగుంటుంది అని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: