"పుష్ప పార్ట్ 3" కూడా రానుందా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప ది రైస్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించింది. మైత్రి సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... సునీల్ ... అనసూయ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నటించారు. మలయాళ నటుడు ఫాహాధ్ ఫజిల్ ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొంత కాలం క్రితమే పుష్ప మూవీ రెండవ భాగం షూటింగ్ భారీ అంచనాల నడుమ ప్రారంభం అయింది. ఈ మూవీ యొక్క రెండవ భాగం షూటింగ్ కొత్త భాగం ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితమే పుష్ప పార్ట్ 2 నుండి ఒక వీడియోను చిత్ర బృందం విడుదల చేయగా ... ఆ వీడియోకు ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. పుష్ప మూవీ కి కొనసాగింపుగా పుష్ప  పార్ట్ 3 కూడా రాబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు చిత్ర బృందం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: