ఆ తేదీ నుండి "ఆంధ్రావాలా" రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!

Pulgam Srinivas
ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రి రిలీజ్ ల ట్రెండ్ ఫుల్ జోరుగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది హీరోలు నటించిన సినిమాలు రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలను కూడా థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు.

అందులో భాగంగా ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాలు క్రితం నటించిన ఆంధ్రావాలా మూవీ ని థియేటర్ లలో ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... రక్షిత ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించింది. చక్రి ఈ మూవీ కి సంగీతం అందించాడు. 2004 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది.

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయింది. అలా ఆ సమయంలో బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలమైన ఈ సినిమాను ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సారి ఈ సినిమా రీ రిలీజ్ భాగంగా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో ... ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఆంధ్రావాలా రీ రిలీజ్ కు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ను బుక్ మై షో ఏప్రిల్ 22 వ తేదీ నుండి ఓపెన్ చేయబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: