నెట్టింటా వైరల్ గా మారిన టాలీవుడ్ కమ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వ్యాఖ్యలు....!!

murali krishna
సౌత్ ఇండస్ట్రీ లో బాగా ఫేమస్ అయిన తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి ఆ తర్వాత వారికీ స్టార్ డమ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీ నే హేళన చేసి మాట్లాడడం, వారిపై అనవసరమైన కామెంట్స్ చేయడం వంటివి చాలా మంది హీరోయిన్స్ చేసారు.
ఇప్పటికే ఈ లిస్టులో చాలా మంది ఉండగా ఇప్పుడు కొత్త గా మరొక భామ యాడ్ అయ్యింది.ఆమె మరెవరో కాదు తాప్సీ పన్ను.
ఈమె సౌత్ ఇండస్ట్రీ లోని తెలుగు ద్వారా నే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఝుమ్మంది నాదం సినిమా తో తెలుగు లో కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే ఈమె నటన, డ్యాన్స్, హావభావాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి మరి కొన్ని అవకాశాలను అందుకుంది.ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత ముంబై వెళ్ళిపోయి అక్కడ నటించడం మొదలు పెట్టింది.
అయితే ఇంత స్టార్ డమ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీ మీద  నే ఈ భామ ఇప్పుడు నోరు పారేసుకుంది. చష్మే బద్దూర్ సినిమా తో బాలీవుడ్ లో కి అడుగు పెట్టిన తాప్సీ హిందీ సినిమాల లో పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని సౌత్ ఇండస్ట్రీ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి.బాలీవుడ్  లో స్టోరీల ఎంపికలో తీసుకున్న నిర్ణయాల వల్లనే అక్కడ మంచి హిట్స్ లభించాయని సౌత్ ఇండస్ట్రీ లో స్టార్ డమ్ వచ్చినా తనకు సంతృప్తి ఇవ్వలేదని బాలీవుడ్ లో చేసిన సినిమాల వల్లనే సంతృప్తి లభించింది అని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.దీంతో ఈమెపై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఛీ ఛీ నువ్వు కూడా ఇంతేనా ఆ లిస్టు లో చేరిపోయావు అని మిగతా హీరోయిన్ లతో తాప్సీని చేర్చి తిడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: