ఆకట్టుకుంటున్న రుద్రంగి టీజర్?

Purushottham Vinay
పీరియాడిక్ యాక్షన్‌ మూవీగా రుద్రంగి సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్ ఇంకా అలాగే విమల రామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సినిమా ఇది. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకి రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా టీజర్ ఇప్పుడు విడుదలైంది. స్వతంత్రం తర్వాత ఆనాటి తెలంగాణ సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జగపతి బాబు భీం రావు దేశ్ ముఖ్ అనే క్రూరమైన దొర పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. స్వాతంత్రం మాకే కానీ బానిసలకు కాదు, వాడు బలవంతుడి కావొచ్చు కానీ నేను భగవంతుడిని అనే మాటల ద్వారా జగపతి బాబు పాత్ర ఎంత క్రూరంగా ఉంటుంది ఇంకా ఆనాటి తెలంగాణాలో దొరల ఆగడాలు ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు అని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది..


మొత్తంగా చెప్పాలంటే టీజర్ ఆసాంతం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. జగపతి బాబు పాత్ర అయితే ఇప్పటి దాకా ఆయన కెరీర్ చేయనిదిగా ఉంది. ఇక చాలా కాలం తరువాత జ్వాలాబాయి దేశ్ ముఖ్ గా మమతా మోహన్ దాస్ కూడా జగపతి పాత్రకు తీసినిపోని విధంగా అహంకారంతో కనిపిస్తోంది. మల్లేష్ గా ఆశిష్ గాంధీకి మంచి పాత్ర వచ్చింది. టేకింగ్, మేకింగ్ పరంగా చాల క్వాలిటీతో ఉంటుంది మూవీ అని స్పష్టంగా అర్థం అవుతోంది. ఆనాటి కాలాన్ని ప్రతిబింబిచేలా ఆర్ట్ వర్క్ చాలా చక్కగా అందంగా ఉంది.రసమయి ఫిలిమ్స్ బ్యానర్ నుంచి భారీ నిర్మాణ హంగులతో తెరకెక్కిస్తున్న 'రుద్రంగి' సినిమా మే నెల 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: