ప్రభాస్ ... దిల్ రాజు కాంబినేషన్ మూవీకి దర్శకుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటు నిర్మాతగా వరుస సినిమాలను నిర్మిస్తూనే డిస్ట్రిబ్యూటర్ గా కూడా అనేక సినిమాలను కొంటూ వాటితో కూడా మంచి లాభాలను అందుకుంటున్న దిల్ రాజు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు ఇండియన్ సినీ మార్కెట్ పై కన్ను వేశాడు.

అందులో భాగంగా ప్రస్తుతం దిల్ రాజు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే దిల్ రాజు తాజాగా శాకుంతలం అనే మూవీ ని నిర్మించిన విషయం మనకు తెలిసిందే.

 గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందున ఈ మూవీ లో దేవ్ మోహన్ హీరో గా నటించగా ... సమంత హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం దిల్ రాజు వరుస ప్రమోషన్ లలో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా తాజాగా దిల్ రాజు తన తదుపరి మూవీ ల గురించి ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే దిల్ రాజు తాజాగా తన తదుపరి మూవీ ల గురించి మాట్లాడుతూ ... మరి కొంత కాలంలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ మూవీ ఉండబోతున్నట్లు ప్రకటించాడు. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: