బాలీవుడ్ స్టార్ జంట విడాకులు నిజమేనా....!!

murali krishna
బాలీవుడ్ క్యూట్ కపుల్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ జంట గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు.
అంతేకాకుండా బాలీవుడ్ లో ఉన్న కపుల్స్ లిస్టులో మీరు అగ్రస్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఈ మధ్యకాలంలో ఎక్కువగా కలిసి కనిపించడం లేదు. చాలావరకు కార్యక్రమాలకు పార్టీలకు ఫంక్షన్లకు ఐశ్వర్య ఒంటరిగా లేదంటే తన కూతుర్ని తీసుకొని వెళుతోంది. ఇదివరకు ఇటువంటి ఫంక్షన్ కి అయినా కూడా భార్య భర్తలు ఇద్దరూ కలిసి వెళ్లేవారు.
అలాంటిది ఇప్పుడు ఐశ్వర్య ఒంటరిగా లేదంటే కూతురితో కలిసి వెళుతుండడంతో అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. తాజాగా ముంబైలో ముకేశ్ అంబానీ ఇంట్లో జరిగిన ఈవెంట్ కి కూడా ఐశ్వర్య ఆరాధ్య మాత్రమే కలిసి వెళ్లడంతో ఆ అనుమానాలకు మరింత ఆద్యం చేకూర్చినట్టు అయింది. ముకేశ్ అంబానీ ఇంటికి అభిషేక్ రాకపోవడంతో చాలామంది అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక ప్రోగ్రాంలో మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో జరిగిన చాలా ప్రోగ్రామ్స్ కి అభిషేక్ అటెండ్ కాకపోవడంతో సోషల్ మీడియా లో వీరిద్దరూ విడిపోబోతున్నారు అని చర్చలు మొదలయ్యాయి. వీరిద్దరి మధ్య గొడవలు జరిగి ఉండవచ్చు అని నెటిజన్స్ అనుమానిస్తున్నారు. అయితే గతంలో కూడా ఐశ్వర్య అభిషేక్ ఎదురు విడిపోతున్నారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా మరొకసారి వీరిద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ 2007 ఏప్రిల్ 20వ తేదీన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2011లో ఆరాధ్య కూడా జన్మించింది. ఇక ఈసారి ఏప్రిల్ 20 న ఈ జంట వారి 16వ మ్యారేజ్ యానివర్సరీని చేసుకోనున్నారు. చాలామంది విడాకులపై స్పందిస్తూ ఒకవేళ వారు నిజంగా విడిపోతుంటే ఏప్రిల్ 20 వ ఏది తెలిసిపోతుంది ఆ రోజున వాళ్ళు మ్యారేజ్ డే జరుపుకోకపోతే ఆ వార్తలు నిజమని నమ్మవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: