క్షమాపణలు చెప్పిన కీరవాణి కొడుకు 'కాలభైరవ '....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ ఇటీవల ఆస్కార్ గెలుపొందిన విషయం అందరికి తెల్సిందే. ఐతే ఇంకా పూర్తి స్థాయిలో ఆ హ్యాపీ మూమెంట్ నుండి ఇంకా బయటకి రాలేదు.ఐతే ఒక్కక్కరిగా దాని గూర్చి సోషల్ మీడియా వేదికగా వాళ్ళ వాళ్ళ అనుభూతులు చెప్పుకుంటున్నారు. ఐతే దాంట్లో భాగంగానే కాల భైరవ చేసిన ఒక  పోస్ట్ చిచ్చుపెట్టింది. ఆస్కార్ అవార్డ్ కొట్టిన కీరవాణి తనయుడు, 'నాటునాటు'ను ఆస్కార్ వేదికపై పాడిన కాలభైరవ చేసిన ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.
దీనిపై ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అసలు వివాదం ఏంటి? ఎందుకు ఇలా అయ్యిందన్న దానిపై అందరూ ఆరాతీస్తున్నారు.
ఆస్కార్ వేదికపై 'నాటునాటు' పాట పాడిన కాలభైరవ ఇండియాకు తిరిగి వస్తూ ఓ పోస్ట్ చేశాడు. అదే మంటపుట్టించింది. ఇంతకీ కాలభైరవ ఏమన్నాడంటే.. 'ఆస్కార్ అకాడమీ అవార్డుల స్టేజీపై లైవ్ లో 'నాటు నాటు' ప్రదర్శన ఇచ్చినందుకు ఎంతో గర్విస్తున్నాను.. రాజమౌళి బాబా, పెద్దమ్మ, అమ్మనాన్న, కార్తికేయ, ప్రేమ్ రక్షిత్ ఇలా వీరందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నాకు ఈ విలువైన అవకాశం దక్కేలా సాయం చేశారు. వాళ్ల శ్రమ, పనితనం వల్లే ఈ పాట ప్రపంచం నలుమూలలకు చేరింది. ఈ పాట పాడే అవకాశం నన్ను వరించింది. వారి కారణంగానే నేను ఈ అందమైన అనుభూతిని పొందగలిగాను. ఈ వాస్తవాన్ని ఎప్పటికీ మరిచిపోను. వాళ్ల విజయంలో నేనూ భాగమైనందుకు ఆనందిస్తున్నా' అని కాలభైరవ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, రాంచరణ్ పేర్లను ప్రస్తావించకుండా కాలభైరవ ట్వీట్ చేయడాన్ని తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో వారందరికీ క్షమాపణలు చెబుతూ కాలభైరవ తాజాగా ఇంకొక పోస్ట్ పెట్యాడు. నేను చేసిన ఈ పోస్ట్ బయటవారికి మరోలా అర్థమైందని ఆస్కార్ స్టేజీపై ప్రదర్శన ఇవ్వడానికి తోడ్పడిన వారికి కృతజ్ఞతలు చెప్పానని మరో ఉద్దేశం తనకు లేదని దానికి అందరు నన్ను  క్షమించండి' అంటూ కాలభైరవ తాజాగా పోస్ట్ చేశారు.
దాంతో ఎన్టీఆర్ మరియు చరణ్ అభిమానుల కోపం తగ్గింది. ఐతే దానికి ఇంకొంతమంది నేటిజన్లు ప్రతి దాన్ని రాధంతం చెయ్యొద్దని ఒక్కోసారి మనము మర్చిపోతుంట మని గుర్తు చేసారు. ఏదైతేనేం ప్రెసెంట్ ఆయన పోస్ట్ తో కధ సుఖంతం యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: