దిల్ రాజు బ్యానర్లో నితిన్ మూవీ... దర్శకుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో అయినటు వంటి నితిన్ ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం మాచర్ల నియోజకవర్గం అనే మూవీ తో నితిన్ ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా సముద్రక్కని ఈ మూవీలో ... సముద్ర ఖని విలన్ పాత్రలో నటించాడు. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో నటించగా ... మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో మరో ముఖ్యమైన పాత్రలో కేథరిన్ కూడా నటించింది. కేథరిన్ పాత్రకి ఈ సినిమాలో నిడివి తక్కువ గానే ఉన్నప్పటికీ తన నటనతో ... అంద చందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో చాలా వరకు విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే నితిన్ ప్రస్తుతం తన కెరియర్ లో 32 వ మూవీ లవ్ హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే నితిన్ ... దిల్ రాజు బ్యానర్ లో ఒక మూవీ లో నటించిడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ ఉగాది కి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: