శ్రీను వైట్ల పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా..?

murali krishna
చిరంజీవి, మహేష్ వంటి స్టార్ హీరోలతో సినిమా లు తీసిన దర్శకుడు శ్రీను వైట్ల ఇప్పుడు కష్టాలను అయితే ఎదుర్కొంటున్నాడుప్రస్తుతం సినిమా ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నా కూడా అస్సలు కుదరడం లేదు.. ఆ మధ్య తాను చేసిన ఢీ సినిమా కు సీక్వెల్ ను కూడా ప్రకటించాడు. మంచు విష్ణు హీరోగా ఆ సీక్వెల్ ను అధికారికంగా ప్రకటిస్తున్నట్లుగా ప్రకటించిన శ్రీను వైట్లకు పాపం షాక్ తగిలిందని చెప్పాలి.ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందనే వార్తలు కూడా వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేక పోవడంతో సినిమా గురించి ఆరా తీయగా మొత్తానికి క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అతి త్వరలోనే సినిమా గురించి కూడా జనాలు మర్చి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. పాపం శ్రీను వైట్ల కెరీర్ ఎక్కడి నుండో ఎక్కడికో అన్నట్లుగా మారిపోయింది అంటూ అభిమానులు  కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఒకానొక సమయంలో శ్రీను వైట్లను స్టార్ గా కీర్తించిన వారు ఆయన గురించి కనీసం మాట్లాడటం కూడా మానేశారు..భారీ కష్టాలను ఎదుర్కొంటున్న దర్శకుడు శ్రీను వైట్ల గురించి ఆయనతో వర్క్ చేసిన వారు కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది.. ఆ మధ్య రవితేజ అవకాశం ఇచ్చాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అది కూడా రూమర్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కొత్త కథలతో యంగ్ హీరోలను సంప్రదించేందుకు శ్రీను వైట్ల ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది.. ఆ ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయి అనేది మరి చూడాలి. గతంలో రామ్ చరణ్ తో చేసిన బ్రూస్ లీ మరియు మహేష్ బాబు తో చేసిన ఆగడు సినిమా లు భారీ డిజాస్టర్ గా నిలిచాయి.అప్పటి నుండి ఆయన కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: