ఆ నెలను టార్గెట్ గా పెట్టుకున్న "ఎస్ఎస్ఎంబి 28" మూవీ యూనిట్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. మహేష్ పోయిన సంవత్సరం కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.
ఇలా వరుస విజయవంతమైన మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ చిత్ర బృందం "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో  చిత్రీకరిస్తుంది. ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా కనిపించనుండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని షెడ్యూల్ ల షూటింగ్ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ యొక్క షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని త్రివిక్రమ్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి ఈ చిట బృందం ఒక డెడ్ లైన్ ను పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా లోని పాటలు మరియు ఒక ఫైట్ సన్నివేశం మినహా మొత్తం షూటింగ్ ను ఏప్రిల్ నెల వరకు పూర్తి చేయాలి అనే ప్లానింగ్ తో ఈ చిత్ర బృందం మూవీ షూటింగ్ ను చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: