మహేష్ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ హైలెట్ కానుందా..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు పోయిన సంవత్సరం పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం అందరికీ తెలిసిందే. సముద్ర ఖని ప్రతి నాయకుడి పాత్రలో నటించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించగా ... కీర్తి సురేష్ ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. 

ఇలా సర్కారు వారి పాట సినిమా విజయంతో అద్భుతమైన జోష్ లో ఉన్న మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్ లుగా కనిపించనుండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. 

అసలు విషయం లోకి వెళితే ... దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథలో సిస్టర్ సెంటిమెంట్ ను హైలెట్ చేసే ఉద్దేశంతో కథను తయారు చేసినట్లు ... అందులో భాగంగా ఈ మూవీ లో సిస్టర్ సెంటిమెంట్ కు సంబంధించిన సీన్ లు అనేకం రానున్నట్లు ... ఆ సీన్ లు కూడా అద్భుతంగా వచ్చే విధంగా కథను తయారు చేసుకున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ రాబోతున్న సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ హైలెట్ గా నిలిచే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: