రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ లాభాలను అందుకున్న "వారసుడు" మూవీ..!

Pulgam Srinivas
ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నా తలపతి విజయ్ తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందినటు వంటి వారిసు అనే తమిళ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రష్మిక మందన ఈ మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీకాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యింది. తెలుగు లో ఈ సినిమాను వారసుడు అనే పేరుతో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే విజయ్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగు లో విడుదల అయ్యి అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంతో విజయ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అలాగే వారసుడు మూవీ కి సంబంధించిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో విడుదలకు ముందే వారసుడు సినిమాపై తెలుగు సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అలా ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి అంచనాలు ఏర్పడ్డ కారణంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.05 కోట్ల షేర్ ... 27.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 0.05 కోట్ల లాభాలను మాత్రమే అందుకొని హిట్ మూవీ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: