ఆదిపురుష్ పై మేకర్స్ అసహనం?

Purushottham Vinay
ఆదిపురుష్ : ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‘.ఇంకా ఈ సినిమాని రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారని తెలిసినప్పటి నుంచి రాముడు గెటప్ లో ప్రభాస్ ఎలా ఉంటారో చూడాలని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. ఆదిపురుష్‌ టీజర్ రిలీజ్ చేశారు కానీ అది ఆశించిన స్థాయిలో అభిమానులని మెప్పించలేకపోయింది. టీజర్ పై నెగిటివిటీ రావడంతో మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశారు. దీని వలన బడ్జెట్ ఇంకా పెరిగింది.మంచి కంటెంట్ ఉన్న మూవీని అందించాలని ఎక్కడా రాజీపడకుండా వర్క్ చేస్తున్నారు.అందుకనే సంక్రాంతికి రావాల్సిన ఆదిపురుష్‌ సినిమాని వాయిదా వేశారు. జూన్ 16 వ తేదీన ఆదిపురుష్ మూవీని విడుదల చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మెజారిటీ పార్ట్ పూర్తయ్యిందని తెలిసింది.

అయితే విజువల్స్ పై టీం ఇంకా అసహనంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. వీలైనంత త్వరగా క్వాలిటీ గ్రాఫిక్స్ తో తీస్తున్నారని సమాచారం. ఇంకా అలాగే రిలీజ్ డేట్ లో కూడా ఇంకా ఎలాంటి మార్పు ఉండదని సమాచారం. మరి ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే… మార్చి నెలలో ఈ మూవీ నుంచి ఒక హై వోల్టేజ్ సాంగ్ ని రిలీజ్ చేసి మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుందని సమాచారం వినిపిస్తోంది.ఇక ఈ సినిమాని వీలైనన్ని ఎక్కువ భాషలలో విడుదల చేయడానికి టి-సిరీస్ ప్లాన్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ అండ్ లవ్ ఎలిమెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: