బద్రి మూవీ స్టోరీ రాసుకుంది పవర్ స్టార్ కోసం కాదా....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాను అతి తక్కువ టైం లో తీసి విడుదల చేసే ఘనతగల స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన ఇండస్ట్రీ లో మాక్సిమం అందరి స్టార్ హీరోస్ తో సినిమాలు చేసాడు. ఐతే తన ఫస్ట్ సినిమా అయిన బద్రి స్టోరీ ని పవన్ కళ్యాణ్ కోసం కాకుండా వేరే హీరో కోసం రాసుకున్నరాట అయితే ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది ముఖ్యం గా ఈ మూవీ తోనే పవన్ కళ్యాణ్ మెడ దగ్గర చేయి పెట్టుకునే స్టైల్ వచ్చింది పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అదే స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నాడు.
ఐతే ఈ స్టోరీ ని పూరి మొదటి అక్కినేని నాగార్జున ని హీరోగా అనుకొని రాసుకున్నారట కానీ ఆయన ఆ టైం లో చాలా సినిమాలకి కమిట్ అయి ఉండడం వల్ల పూరి కి ఆయన డేట్స్ ఇవ్వలేక పోయాడు.దాంతో పూరీకి పవన్ కళ్యాణ్ తో అవకాశం రావడంతో పూరి ఈ మూవీని పవన్ కళ్యాణ్ తో చేసినట్లు తెలుస్తుంది.ఐతే పవన్ కళ్యాణ్ లాంటి యంగ్ హీరోతో తన మొదటి సినిమా చేసినందుకు పూరి ఇప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక పూరి అనే పేరుకి చిత్ర పరిశ్రంలో  ఒక బ్రాండ్ వాల్యూ ఉంది అలాంటి పూరి ని ఇండస్ట్రీ కి  పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ విషయం లో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోష పడుతుంటారు. బద్రి సినిమా అనేది అటు పూరి కి ఇటు పవన్ కి చాలా గుర్తుండిపోయే సినిమా అనే చెప్పాలి ఎందుకంటే అప్పట్లో ఆ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది ఇలాంటిది కాదు.ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మూవీ రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు తొందరలోనే ఈ సినిమా రీ రిలీజ్ చేసే ఆలోచన లో ఉన్నారు.అలాగే తర్వాత పూరి జగన్నాథ్ నాగార్జున కాంబినేషన్ లో ఆ తర్వాత సూపర్, శివమణి అనే రెండు సినిమాలు వచ్చాయి సూపర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది కానీ శివమణి మాత్రం నాగార్జున కెరియర్ లో ఒక మంచి హిట్ సినిమా గా నిలిచింది అనే చెప్పాలి.వీళ్ళ కాంబోలో ఇంకో సినిమా కూడా రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. నిజ జీవితంలో పూరి నాగార్జున మంచి స్నేహితులు. ఏ విషయం ఉన్న ఇద్దరు షేర్ చేసుకునేంత మంచి ఫ్రెండ్స్ వీళ్ళ కాంబో లో ఇంకో సినిమా వచ్చిన రావచ్చు.
కానీ అప్పట్లో నాగార్జున ఈ మూవీ చేస్తే దాని ప్రభావం మాత్రం ఇంతలాగా ఉండేది కాదనే చెప్పాలి. ఏదేమైనా నాగార్జున గారు ఆ సినిమాను వదులుకున్నందుకు అనేక సార్లు బాధపడేవరని మేకర్స్ ద్వారా తెల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: