పరశురాం కి అంత డిమాండ్ ఉందా..?

shami
టాలీవుడ్ డైరెక్టర్ పరశురాం గీతా గోవిందం తో 100 కోట్ల మార్క్ టచ్ చేయగా ఆ సినిమా తర్వాత మహేష్ సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేశాడు. ఇక ఇప్పుడు మహేష్ సినిమా అయ్యాక కూడా వెయిట్ తప్పట్లేదు. ఈమధ్యనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా ఓకే చేసుకున్న పరశురాం ఆ సినిమాతో ఈక్వెల్ గా తమిళ హీరో కార్తీకి కూడా కథ చెప్పి ఒప్పించాడట. ఇన్నాళ్లు ఏం చేశాడో కానీ పరశురాం ఒకేసారి ఇద్దరు హీరోల సినిమాలతో వార్తల్లో నిలిచాడు. అయితే ముందు విజయ్ సినిమా చేయాలని అనుకున్నా అతనికి లేట్ ఉందని తెలిసి కార్తీతోనే ముందు సినిమా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడట.
కార్తీ హీరోగా పరశురాం డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా రేంజ్ రాజు అని కూడా పెట్టారని టాక్. అయితే ఈ సినిమాకు పరశురాం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని టాక్. ఒకటి రెండు కాదు ఏకంగా 20 కోట్ల దాకా పరశురాం రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. అయితే పరశురాం కి అంత డిమాండ్ ఉందా.. లేదా తను రాసుకున్న కథకి అంత డిమాండ్ ఉందా అన్నది తెలియదు కానీ మహేష్ తో సినిమా తీసినా పరశురాం ఇంకా స్టార్ డైరెక్టర్ అనిపించుకోలేదని కొందరి టాక్.
మరి అలాంటి పరశురాం కి 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారా అన్నది షాకింగ్ గానే ఉంది. అయితే ఏమో పరశురాం ఏమైనా తక్కువ వాడా రెండు వరుస 100 కోట్లు సినిమాలను ఇచ్చిన డైరెక్టర్ అలాంటి అతనికి 20 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పేమి లేదు అనుకున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా పరశురాం డైరెక్షన్ లో కార్తీ సినిమాపై అసలు మ్యాటర్ కన్నా రెమ్యునరేషన్ విషయంలో హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరి పరశురాం ఈ విషయంపై క్లారిటీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: