బీబీ జోడి జడ్జెస్ పై.. కౌశల్ షాకింగ్ కామెంట్స్?

praveen
బిగ్బాస్ విన్నర్ కౌశల్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ కొత్తగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా  వెళ్లిన తర్వాత ఏకంగా బిగ్ బాస్ నే కంట్రోల్ చేసే విధంగా క్రేజ్ సంపాదించాడు. తాను ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే వారిని ఎలిమినేట్ చేసే విధంగా బయట ఉన్న తన ఫ్యాన్స్ ని కంట్రోల్ చేశాడు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు కౌశల్ కి ఏర్పడిన ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు బిగ్బాస్ నిర్వాహకులు కూడా ఏం చేయలేకపోయారు. ఇక అప్పట్లో కౌశల్ ఎక్కడ ప్రత్యక్షమైనా కూడా ఏకంగా స్టార్ హీరోలు వచ్చినప్పుడు కనిపించినంతమంది అభిమానులు కూడా కనిపించారు.

 ఇక ఆ తర్వాత హడావిడి చేసిన అభిమానులు.. ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన కౌశల్ కూడా సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించకుండా పోయారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరితో కలిసి బీబీ జోడి అనే కార్యక్రమాన్ని ప్లాన్ చేయగా.. ఇక ఇందులో కౌశల్ కూడా పాల్గొంటూ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చేసినట్లుగానే ఇక బిబి జోడిలో కూడా స్ట్రాటజీస్ ప్లాన్ చేసి ప్రతి విషయంపై కూడా వాదనకు దిగుతూ ఉండడం ప్రేక్షకులకు అస్సలు నచ్చడం లేదు. ఇకపోతే ఇటీవల ఏకంగా బీబీ జోడీ జడ్జెస్ పైనే కౌశల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 వాసంతి, అర్జున్ కళ్యాణ్ జోడి తమ డాన్స్ తో జడ్జిలను  మెప్పించారు. కానీ రవి, భాను జోడి వారికి ఒక్క మార్కు మాత్రమే ఇచ్చారు. వాళ్ళకి ఒక మార్కు ఇస్తేనే మేము సేవ్ అవుతామంటూ స్ట్రాటజీ ఉపయోగించారు. ఇక జడ్జెస్ సైతం స్ట్రాటజీ ఉపయోగించి రవి, భానుకి తక్కువ మార్కులు ఇవ్వడంతో వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇదే విషయాన్ని తప్పుపడుతూ.. ఉద్దేశం ప్రకారం బీబి జోడి విజేతలు రవి, భాను. ఎందుకంటే వాళ్లు డాన్స్ చేసిన విధానం ప్రతి రౌండ్లో పింక్ సెట్ గెలుచుకున్న తీరు అద్భుతం. బిగ్బాస్ పోటీదారులుగా వారు వ్యూహాల ప్రకారం ఆడటానికి వారికి అవకాశం ఉంది. కానీ న్యాయ నిర్నేతలుగా ఉన్న జడ్జెస్ ఇలా స్ట్రాటజీ ఉపయోగించే హక్కు లేదు. కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ ను బట్టి వారికి మార్కులు ఇవ్వాలి అంటూ కౌశల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: