బిగ్ బాస్-7 కోసం మాస్టర్ ప్లాన్.. విడాకుల జంట హౌస్ లోకి?

praveen
బిగ్ బాస్ అనే కార్యక్రమం గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. దాదాపు అన్ని భాషల్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే మిగతా భాషల్లో సూపర్ సక్సెస్ అవుతున్న బిగ్ బాస్ అటు తెలుగులో మాత్రం అంతంత మాత్రం రేటింగ్స్ మాత్రమే సొంతం చేసుకుంటూ చివరికి నిర్వాహకులకు నష్టాలనే మిగులుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు వరకు ఆరు సీజన్స్ పూర్తయ్యాయి. అయితే ఇక గత సీజన్కు వచ్చిన రేటింగ్స్ దృశ్య ఈ ఏడాది బిగ్ బాస్ కొత్త సీజన్ ఉంటుందా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఒకవేళ బిగ్ బాస్ ఏడవ సీజన్ ఉంటే ఇక రేటింగ్స్ కోసం నిర్వాహకులు ఎలాంటి కొత్త ప్లాన్స్ వేస్తున్నారు అన్నది కూడా చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ ఏడవ సీజన్ కి హోస్టుగా నాగార్జున తప్పుకునే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి హోస్టుగా రానా బాలకృష్ణ రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ వీళ్లలో ఎవరో ఒకరు రాబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు వరకు బిగ్ బాస్ హౌస్ లోకి పెళ్లి చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఉన్న జంటలను ఇక జోడిగా హౌస్ లోకి పంపించడం చూశాము.

 కానీ బిగ్ బాస్ 7వ సీజన్ కోసం మాత్రం నిర్వాహకులు ఒక బిగ్ ప్లాన్ వేశారట. ఇంతకుముందు సీజన్లో లాగా అన్యోన్యంగా ఉన్న దంపతులను కాదు మనస్పర్ధలతో విడిపోయి విడాకులు తీసుకున్న జంటను హౌస్ లోకి పంపించబోతున్నారట. స్టార్ సింగర్ నోయల్ ప్రముఖ నటి ఎస్టర్ బిగ్ బాస్ లోకి పంపించబోతున్నారట. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత మనస్పర్ధలు  రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక ఒకరిపై ఒకరు షాకింగ్ ఆరోపణలు కూడా చేసుకున్నారు. వీరిద్దరని హౌస్ లోకి పంపిస్తే ఇక జనాలు ఆసక్తిగా షో చూస్తారని టిఆర్పి రేటింగ్ పెరుగుతుందని అనుకుంటున్నారట నిర్వాహకులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: