రెమ్యూనరేషన్ పెంచిన వెంకీ మామ.. ఎంతో తెలుసా?

praveen
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు వెంకటేష్. అయితే సీనియర్ హీరోలు ఎంతమంది ఉన్నా ఇక వెంకటేష్ కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. తన సినిమాలతో ఫ్యామిలీ హీరోగా ఒక బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు వెంకటేష్. అంతేకాదు సినిమాల్లో వెంకటేష్ పండించిన హావభావాలను మరే ఇతర హీరో పండించలేడేమో అన్న ఇంతలా తన నటనతో ఆకట్టుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు వెంకటేష్. అంతే కాదు వరుస విజయాలను కూడా ఖాతాలో వేసుకుంటున్నాడు. ఒకవైపు మల్టీస్టారర్ సినిమాలను చేస్తూనే మరోవైపు ఇక సింగిల్ గా కూడా సినిమాలను తీసేస్తున్నాడు.

 యువ హీరో వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 3 సినిమాలో నటించి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న వెంకటేష్ ఓరి దేవుడా సినిమాలో కీలకపాత్రలో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఇకపోతే వెంకటేష్ కెరియర్ లో 75వ సినిమాగా సైంధవ్ మూవీ రాబోతుంది అన్న విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ మూవీ ఉండబోతుంది. ఇప్పటికే హిట్ 2 సినిమాతో శైలేష్ మంచి హిట్ అందుకున్నాడు. అంతేకాదు ప్రేక్షకుల్లో శైలేష్ సినిమా ఒక మంచి భావన ఏర్పడింది.

 దీంతో వెంకటేష్ తో సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయ్. అయితే సైంధవ్ సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. అయితే ఇక ఈ సినిమా కోసం సీనియర్ హీరో వెంకటేష్ రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెంచేసాడట. దీంతో నిర్మాత షాక్ అవుతున్నారట. ఏకంగా తన సొంత అన్న బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్ లోనే ఈ సినిమా రాబోతుంది.  అయితే ఈ సినిమా కోసం వెంకటేష్ ఏకంగా 17 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. అయితే ఇక అన్న సురేష్ బాబు కూడా ఇంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. కాగా ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: