లియో షూట్ లో అస్వస్థకు గురైన త్రిష.. ఏమైందంటే..?
ఇక్కడ మరొకవైపు 14 సంవత్సరాల తర్వాత విజయ్ తో స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా పిక్స్ కావడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమా షూటింగు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో త్రిష అస్వస్థకు గురైనట్టు సినీ వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే రీసెంట్గా లియో సినిమా యూనిట్ అంతా కాశ్మీర్ కి పయనమైన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్లో చలి తీవ్రత మూలంగా ఆమె చాలా ఇబ్బందికి లోనైందట. అందుకే అక్కడ ఉండలేక తీవ్ర జ్వరానికి కూడా ఆమె గురి అవడంతో వెంటనే అక్కడి నుండి వచ్చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే ఈ షెడ్యూల్లో ఆమె సీన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిందని అందుకే ఆమె ఇంటికి వచ్చేసింది అంటూ కూడా సినీవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. మరొకవైపు ఈ సినిమాకి కార్తీక్ ఖైదీ సినిమాకి లింకు ఉండవచ్చని పలు రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. వారిసు సినిమా తర్వాత విజయ్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి వారి సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన విజయ్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది కూడా అభిమానులలో ఆసక్తిగా మారింది. మొత్తానికైతే దాదాపు 14 సంవత్సరాల తర్వాత జతకట్టనున్న ఈ కాంబినేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుందని వార్త కూడా వినిపిస్తోంది.