ప్రభాస్ కి అశ్వస్థత.. రెస్ట్ కావాలంటున్న డాక్టర్లు?

Purushottham Vinay
బాహుబలి సినిమాతో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టి దేశంలోనే పెద్ద పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతూ ఫుల్ బిజీ అయ్యాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ఇప్పుడు తాజాగా ఆయన హాస్పటల్ కు వెళ్లడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ప్రభాస్ ఎందుకు హాస్పటల్ కు వెళ్లాడబ్బా అని ఫ్యాన్స్ అందరూ కూడా ఆరా తీయడం స్టార్ట్ చేసారు.అయితే ప్రభాస్ హాస్పటల్ కు వెళ్ళడానికి కారణం  జ్వరమని సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ కొంచెం కూడా రెస్ట్  తీసుకోకుండా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె, మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ ఇంకా అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ వంటి సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఈ మూడు పాన్ ఇండియా మూవీలు సెట్స్ పై ఉన్నాయి. ఇలా ఒకేసారి రెస్ట్ లేకుండా మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ ఉండడం తో ప్రభాస్ కి జ్వరం వచ్చింది.


అందుకే దీంతో ఆయన హాస్పటల్ కు వెళ్లగా డాక్టర్స్ ఆయన ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని సూచించారట. ఇక డాక్టర్స్ సలహా ప్రకారం ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడట. దీంతో మారుతీతో చేసే సినిమా షూటింగ్ షెడ్యూల్ లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇక మారుతీతో చేస్తున్న సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ ఇప్పటి దాకా తన కెరీర్లో టచ్ చేయని హారర్ కామెడీ జోనర్‌లో సినిమా ఉంటుందనేది సినీ వర్గాల్లో  వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. వారిలో ఒకరు నిధి అగర్వాల్‌ ఇంకా మరొకరు మాళవికా మోహనన్ కాగా.. మూడో హీరోయిన్ గా రిద్ధి కుమార్ నటిస్తుంది. ఈ సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: