యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొడుతున్న వాల్తేరు వీరయ్య..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే మంచి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులలో ఒకరు అయినటువంటి బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన  ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా , బాబీ సింహ , ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలలో నటించారు. మైత్రి సంస్థ నిర్మించిన ఈ సినిమాలో క్యాథరిన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా , ఊర్వశి రౌటెల "బాస్ పార్టీ" అనే స్పెషల్ సాంగ్ లో నటించింది.

ముఖ్యంగా ఈ మూవీ ద్వారా ఊర్వశి రౌటెల కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా జనవరి 13 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ జనవరి 12 వ తేదీన యుఎస్ఏ లో భారీ ఎత్తున ప్రీమియర్ షో లు కూడా ప్రదర్శించబడింది.  ఈ మూవీ ప్రీమియర్ షో లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఆ తర్వాత ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు యూఎస్ఏ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు లభించాయి. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని యూఎస్ఏ లో శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు విడుదల చేశారు. తాజాగా శ్లోక సంస్థ వారు ఈ సినిమా యూఎస్ఏ లో 2.2 మిలియన్ ప్లస్ కలక్షన్ లను వసూలు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఇలా వాల్తేరు వీరయ్య మూవీ యూఎస్ఏ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను రాబడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: