విజయ్ వారిసు తెలుగు వెర్షన్ పట్ల అసంతృప్తిగా ఉన్నాడా..? రిలీజ్ వాయిదా..!

Divya
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం వారసుడు. ఈ సినిమాలో మొదటిసారి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించబోతున్నారు. ఈ సినిమాను తమిళంలో వారిసు పేరిట రిలీజ్ చేయబోతున్నారు. దిల్ రాజు ఈ సినిమా కోసం విజయ్ దళపతికి ఏకంగా రూ. 100 కోట్ల పారితోషకం ఇవ్వడంతో పాటు మొత్తం కలిపి సినిమా కోసం రూ.250 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించాడు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అయితే సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు పోటీ పడుతున్నాయి. మరొకవైపు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తునివు సినిమా కూడా సంక్రాంతి పండుగకు బరిలో దిగబోతోంది. ఈ క్రమంలోని ఈ సినిమాలన్నింటినీ కాదని వారసుడు సినిమా కోసం ఎక్కువ థియేటర్లను కేటాయించారు దిల్ రాజు. మరోపక్క నైజాం , వైజాగ్ ఏరియాలలో తునివు డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకొని తెగింపు పేరిట తెలుగులో విడుదల చేయబోతున్నారు. దీంతో చిరంజీవి,  బాలకృష్ణ అభిమానులు థియేటర్లు దొరకడం లేదని పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఈ సినిమాల నుంచి విడుదలైన ట్రైలర్స్ చూస్తూ ఉంటే వారసుడు ట్రైలర్ పూర్తిస్థాయిలో ట్రోలింగ్ కి గురి అవుతోంది.. అందులో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రాలను కలిపి.. తిప్పి చూస్తే వారసుడు సినిమా అవుతుందంటూ బాగా ట్రోల్స్ వస్తున్నాయి.  అంతేకాదు ప్రీ బుకింగ్స్ కూడా పెద్దగా జరగడం లేదు.  దీంతో ఈ సినిమా తెలుగు వర్షన్ పై విజయ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం పరిస్థితి అంతా బాగా కొనసాగలేదు.. కాబట్టి ఈ తెలుగు వర్షన్ జనవరి 11 లేదా 14వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.  అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: