ధనుష్ తెలుగు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా..?

Divya
కోలీవుడ్ డైరెక్టర్ ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం గమనార్హం.  ఇకపోతే జాతీయ నటుడిగా అవార్డు అందుకొని హాలీవుడ్ సినిమాలలో ఆఫర్స్ కూడా అందుకుంటూ అక్కడ కూడా సినిమాలు చేస్తూ వరల్డ్ వైడ్ హీరో అనిపించుకుంటున్నారు ధనుష్. ఇకపోతే ఈయన నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ అయి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడుగా మారాడు. అంతేకాదు మరొకవైపు సౌత్ ఇండియన్  సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు కావడంతో ఈయన పేరు మరింత మారుమ్రోగిపోతుంది.
ప్రస్తుతం ఈయన డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు. తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. సార్ అనే టైటిల్ తో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకోబోతోంది. బై లింగ్వల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ధనుష్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉండడం గమనార్హం.. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.  మరొకవైపు శేఖర్ కమ్ములా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు.  వీటితోపాటు మరో నాలుగు ప్రాజెక్టులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రీకారం సినిమాతో మంచి హిట్టు కొట్టి దర్శకుడిగా జర్నీ మొదలుపెట్టిన డైరెక్టర్ కిషోర్ ధనుష్ ఈ సినిమాకి డైరెక్షన్ చేయనున్నాడు అని ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నారని సమాచారం .అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.కానీ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముగ్గురి డైరెక్టర్లను లైన్ లో పెట్టిన ధనుష్ ఆ తర్వాత కూడా తెలుగు దర్శకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నాడు అని సమాచారం. ఏది ఏమైనా కోలీవుడ్ స్టార్ హీరో తెలుగు డైరెక్టర్ల పై మక్కువ చూపుతుండడంతో తెలుగు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: